మద్నూర్ లో కేంద్రీయవిద్యాలయం ప్రారంభించాలని రిలే దీక్ష

జుక్కల్, సెప్టెంబర్ 28,(జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో
కేంద్రీయ విద్యాలయం ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని కోరుతూ మద్నూర్ గ్రామప్రజలు యువకులు బుదవారం రిలేనిరహరదీక్ష ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు కేంద్రీయ విద్యాలయం మంజూరయి మూడు సంవ్సరాలు గడుస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యాలయాన్ని ప్రారంభిస్త లేరని అన్నారు.ఈ విద్యాలయం ఏర్పాటుకు మద్నూర్ లో పది ఎకరాల స్థలం కూడా కెటాయించడం జరిగిందని తెలిపారు.
కేంద్రీయ విద్యాలయం ప్రారంభించే వరకు రీలే దీక్ష లు చేపడతామని వారు తెలిపారు.ఈ దీక్షలో చాట్లవార్ గోపాల్, హన్మాండ్లు స్వామి, సంగాయప్ప, తుకారాం తెప్పవార్, యాదవ్ రావ్ కంచిన్వార్, కృష్ణ పటేల్, పెంటేష్ రచ్చవార్, శివాజీ గలబేవార్, ప్రకాష్ నాగంవార్, అశోక్ సందుర్వార్, నరేష్ సక్కర్లవార్, రాజు అవార్వార్, గంగాధర్ గొల్లవార్ తదితరులు పాల్గొన్నారు.