మల్దకల్ తిమ్మప్ప స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ

మల్దకల్ సెప్టెంబర్ 25 (జనంసాక్షి) ఆది శిలాక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం అమావాస్య రావడంతో భక్తుల తాకిడి పెరిగింది.వివిధ ప్రాంతాల భక్తులు ఉదయం నుండి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవాలయానికి వచ్చే భక్తులకు ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి,దేవాలయ సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించారు.ఈ సందర్భంగా దేవాలయ అవరణలో మొత్తం భక్తులతో కిటకిటలాడింది. కాకతీయ టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో చంద్రశేఖర రావు,దామ మురళి, జంగం శేఖరయ్య, పెద్దొడ్డి హనుమన్న, ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రవి ఆచారి పూజార్లు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.అదేవిధంగా దేవాలయం ఆవరణలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి జీవిత చరిత్ర గురించి ప్రముఖ హరికథ పితామహుడు హెచ్ఎం సుధాకర్ ఆధ్వర్యంలో కథ వినిపించారు.హార్మోనియం రాముడు,తబలిస్టు బండలయ్య ,సహకారం అందించారు.