మహంకాళి మందిరం వద్ద ఘనంగా బోనాల పండుగ, అన్నద్దాన్న కార్యక్రమం.
జహీరాబాద్ జులై 27 (జనంసాక్షి)
జహీరాబాద్ పట్టణ పరిధిలోని మొగుడంపల్లి చౌరస్తా మహంకాళి వద్ద మంగళవారం రాత్రి బోనాలు, రంగము, బుదవారం రోజు అమ్మ వారికి బలి పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆలయ పూజారి రాజు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు ఉదయం నుండి మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆషాడం మాసం మరియు శ్రావణమాసం లో నిర్వహించే గ్రామదేవతల అమ్మవార్లకు అతి పవిత్రంగా బోనాలను నైవేద్యంగా సమర్పించడం మన ఆనవాయితీ తెలంగాణ సాంప్రదాయ ప్రతీక అని రాజు స్వామి తెలిపారు. అనంతరం భక్తులు అమ్మవారి తీర్థప్రసాలు స్వీకరించి వారి మొక్కులను తీర్చుకున్నారు. ఈ యొక్క బోనాల జాతరను ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా జరుపుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.