మహా సభను జయప్రదం చేయండి

వాల్ పోస్టర్ విడుదల చేసిన భవన నిర్మాణ కార్మికులు

అచ్చంపేట ఆర్సీ, సెప్టెంబర్,20(జనం సాక్షి న్యూస్): భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28న జరిగే మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిచంద్ర, జిల్లా అధ్యక్షులు సీమోహన్,అన్నారు.పట్టణంలో భవన కార్మికుల సంఘ భవనంలో మంగళవారం జిల్లా 2వ మహా సభల వాల్ పోస్టర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 28 జరిగే జిల్లా రెండో మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కామల్ల అయిలన్న హాజరవుతారన్నారని తెలిపారు. నియోజకవర్గంలోని భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభలను జయప్రదం చేయాలని వారు కోరారు. భవన నిర్మాణ కార్మికుల హక్కుల రక్షణకై నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి సూర్యం,అచ్చంపేట భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు నిరంజన్,కార్యదర్శి సూర్య నారాయణ, సంఘ సభ్యులు ఆనందం,వెంకటయ్య, రఘునందన్, శ్రీను,ఆశీర్వాదం, తిరుపతయ్య, షేక్ శావలి,తదితరులు పాల్గొన్నారు.