మారువేశంలో ఎరువుల షాపుల తనిఖీ

నిబంధనలు పాటించని షాపుల మూసివేత
విజయవాడ సబ్‌ కలెక్టర్‌ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ షాక్‌
విజయవాడ,అగస్టు7(జనంసాక్షి): మారు వేషంలో ఎరువుల షాప్‌ ఓనర్లకు విజయవాడ సబ్‌ కలెక్టర్‌ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ షాక్‌ ఇచ్చారు. కృష్ణా జిల్లా కైకలూరులోని ఓ ఎరువుల షాపులోకి సాధారణ రైతులా వెళ్లిన సబ్‌ కలెక్టర్‌ ఎరువులు కావాలని అడిగాడు. ఐతే షాప్‌ యజమాని స్టాక్‌ ఉన్నప్పటికీ లేదని చెప్పాడు. తర్వాత పక్కనే మరో షాప్‌ కు వెళ్లిన సబ్‌ కలెక్టర్‌ ఎరువులు అడిగాడు. ఐతే ఎరువులు ఇచ్చిన షాప్‌ ఓనర్‌…నిర్ణీత ధర కంటే ఎక్కువగా వసూలు చేశాడు. అందుకు సంబంధించిన బిల్లు కూడా ఇవ్వలేదు. దీంతో అక్కడికి సంబంధిత అధికారులను పిలిపించిన కలెక్టర్‌….రెండు షాప్‌ లను సీజ్‌ చేయించారు. తర్వాత అక్కడి నుంచి ముదినేపల్లికి వెళ్లారు. ఐతే అక్కడ షాప్స్‌ క్లోజ్‌ చేసి ఉండడంతో రైతులను ఎరువుల ధరలపై అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని తెలుసుకుని…షాప్స్‌ సీజ్‌ చేయించారు.