మునుగోడులో టిఆర్ఎస్ గెలుపు ఖాయం.

జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ , అక్టోబర్ 11 (జనంసాక్షి):
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. మంగళవారం సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు  పిలుపుమేరకు  మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. టిఆర్ఎస్ విజయ డంక మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు పనిచేసే నాయకుడికి పట్టం కడతారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.