మృతుల కుటుంబాలకు బిజెపి పార్టీ అండగా ఉంటుంది

జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు చనిపోయిన విషయం తెలిసిందే
లింగంపల్లి  గ్రామస్తురాలు సుష్మ ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని సీతారాం పేట గ్రామానికి చెందిన లావణ్య  కుటుంబ సభ్యులని పరామర్శించిన జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తలోజు ఆచారి ,మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి
బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి
పాల్గొని వారికి 25000 ఆర్ధిక సహాయం అందించారు…అలాగే వారి పిల్లలకి భవిష్యత్ లో విద్యకోసం తగు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు దండే శ్రీశైలం, లింగంపల్లి బీజేపీ కార్యకర్తలు.పూలకంటి మహేందర్ రెడ్డి పులకంటి శ్రీనివాస్ రెడ్డి ,అణిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, బస్సు ప్రభాకర్ రెడ్డి,బత్తుల ప్రభాకర్ రెడ్డి,నందిగాని లక్ష్మరెడ్డి,భాస్కర్  నాగరాజు,బత్తుల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు