మోత్కూరులో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

యాదాద్రి భువనగిరి,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): మోత్కూరు పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డిసిపి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సోదాలు జరిపారు. సరైన పత్రాలు లేని 50 బైక్‌ లు, 6 ఆటోలు, 5 కార్లు, ఓ ట్రాక్టర్‌ ను స్వాధీనం చేసుకున్నారు. లక్ష రూపాయలు విలువ చేసే 8 బస్తాల నిషేదిత గుట్కా, 13 ప్యాకెట్ల కల్తీ టీ పౌడర్‌ ను సీజ్‌ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. కార్డన్‌ సర్చ్‌లు మామూలేనని అన్నారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగ ఆఉండాలని గ్రామస్థులకు పోలీసులు సూచించారు.