యాదవుల మధ్య చిచ్చు పెట్టవద్దు – విచ్ఛిన్నమే లక్ష్యంగా పనిచేస్తున్నారు

డోర్నకల్ సెప్టెంబర్ 28 జనం సాక్షి

ఐక్యమత్యానికి మారుపేరైన యాదవులను చిచ్చు పెట్టి విచ్ఛిన్నం చేసి తమ పబ్బం గడుపుకోవాలని కొందరు స్వార్థపరులు ప్రయత్నిస్తున్నారని యాదవ సంఘ నాయకులు కేశబోయిన మల్లేశం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బుధవారం పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గొర్ల పెంపకదార్ల సంఘం అధ్యక్షు పదవి కాలం ముగిసిన రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆయన అన్నారు.గత కొన్నేళ్లుగా చైర్మన్ గా కొనసాగుతున్న తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సంఘానికి మచ్చలేని సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.తనపై చేస్తున్న ఆరోపణలపై బహిరంగ విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు.యాదవుల మధ్య చిచ్చు పెట్టి ఐక్యతను దెబ్బతీయవద్దని అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.లేనియెడల తగు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.