*యువకులకు బ్యాండ్ సెట్ పంపిణీ చేసిన వార్డు సభ్యులు వీరాచారి*

రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి గ్రామంలో బ్యాండ్ కొట్టే యువకులకు ఉపాధి నిమిత్తం తన వంతు సహాయంగా కొత్త బ్యాండ్ సెట్ కొని ఇచ్చిన గ్రామపంచాయతీ వార్డు సభ్యులు వీరాచారి.
అనంతరం యువకులు వార్డు సభ్యులు వీరాచారని ఘనంగా శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో ఉపాధి కోల్పోవడంతో యువకులకు వారి ఉపాధి కల్పన కొరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అన్నారు. దీనితో యువకులు ఆర్థికంగా డబ్బులు సంపాదించుకోవాలని స్థిరపడాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భీష్మ గౌడ్ , మహేష్ , మధు, యాదయ్య , రాములు, బల్వంత్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : సుల్తాన్ పల్లి లో యువకులకు బ్యాండ్ సెట్ అందజేస్తున్న వార్డు సభ్యులు వీరాచారి.