యువతిని నమ్మించి మోసం చేసిన వి ఆర్ ఓ.

భార్యకు పిల్లలు కావడం లేదని.. మరో యువతిని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన తాండూరులో చోటుచేసుకుంది. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్ మండలం దమార్చెడ్ గ్రామానికి చెందిన బోయ కార్తీక్ పెద్దేముల్ మండలం లో వీఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్నాడు. తన భార్యకు పిల్లలు పుట్టడం లేదని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యాడు. దీంతో తాండూరు కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే కార్తీక్ భార్యకు సంతానం కావడంతో యువతిని పెళ్లి చేసుకోను అని చెప్పడంతో పాటు పెళ్లి చేసుకోమని అడిగితే చంపేస్తాన్నంటూ.. బెదిరించాడు. దీంతో స్థానిక పోలీసులను ఆశ్రయించిన యువతి.. వీఆర్ఓ కార్తీక్, అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కార్తీక్‌తో పాటు మరో 6 గురిపై కేసు నమోదు చేసినట్లుగా సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు