యూత్ కాంగ్రెస్ నాయకుడి స్మారకార్తం పెన్నులు, పుస్తకాల పంపిణీ

బోధన్, ఆగస్టు 18 (జనంసాక్షి ) : బోధన్ పట్టణం 8వ వార్డుకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు అఖిల్ స్మారకార్తం శుక్రవారం తట్టుకోట పాఠశాల విద్యార్థులకు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి దొడ్ల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, పెన్సిల్స్ అందించారు. అఖిల్ జయంతిని పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ మేరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, పెన్సిల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు హరి, మాజీ కౌన్సిలర్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.