రక్తదానం చేసిన వైద్యులు సంపత్ కుమార్.

తాండూరు జులై 6(జనంసాక్షి) ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం ఎంతో తోడ్పాటు లభిస్తుందని వైద్యులు డాక్టర్ సంపత్ కుమార్ పేర్కొన్నారు. తాండూరు పట్టణం ఓ పంక్షన్ హాల్ లో బుధవారం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి బాలాజీ నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ సంపత్ కుమార్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వైద్యులు సంపత్ కుమార్ మాట్లాడుతూ రక్తదానంతో మరొకరికి ప్రాణదాతగా నిలవడం జరుగుతుందని అన్నారు. యువకులు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు రావని సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్పు కౌన్సిలర్ రాఘవేందర్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, తాండూరు మండల అధ్యక్షులు రాందాస్,
కోఆప్షన్ సంఘం  అధ్యక్షుడు అక్బర్ బాబా, యువ నాయకులు అనిల్ బాండ్ , తదితరులు పాల్గొన్నారు.