రక్తదానం ప్రాణదానంతో సమానం

తాండూరు జులై 6(జనంసాక్షి) రక్తదానం ప్రాణదానంతో సమానంతో సమానమని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరులోని ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో రక్తం నిలువలు తక్కువగా ఉన్నాయని గుర్తించి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాబంధు టీం బుధవారం తాండూర్ లోని వైట్ ప్యాలెస్ లో మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అక్కడే ఉండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పరిస్థితుల్లో రక్త నిల్వలు తగ్గిపోయి ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇటువంటి సమయంలో రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదాతలుగా నిలవడం అభినందనీయమని అన్నారు. ప్రాణాపాయం నుండి కాపాడే డాక్టర్లతో సహా రక్తదానం చేసిన వారు దేవుళ్లతో సమానం అన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను ఎమ్మెల్యే అందజేశారు.