రాంనగర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

కుల్కచర్ల, అక్టోబర్ 7 (జనం సాక్షి):
కుల్కచర్ల మండలం రాంనగర్ గ్రామంలో
ముదిరాజ్ సంఘం నూతన కమిటీని మండల అధ్యక్షులు చంద్రలింగం ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా డి వెంకటయ్య,
ప్రధాన కార్యదర్శిగా కే సంతోష్
ఉపాధ్యక్షులుగా భీమయ్య, హనుమంతు,
కార్యదర్శులుగా పి వెంకటయ్య, పి హనుమంతు, సోషల్ మీడియా కన్వీనర్ గా పి హనుమంతు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.అనంతరం పలువురు మాట్లాడుతూ..ముదిరాజులు విద్యాపరంగా, ఆర్థికంగా,రాజకీయంగా ఎదగాలని,ఏ రాజకీయ పార్టీ అయినా ముదిరాజులను ఓటు బ్యాంకులుగా మాత్రమే చూస్తున్నారే తప్ప ఆర్థిక పరమైన వనరులు చేకూర్చడంలో అన్ని పార్టీలు విఫలమవుతున్నాయన్నారు.
ముదిరాజుల ప్రధానా డిమాండ్   ముదిరాజులను బిసి D నుండి బీసీ A లోకి మార్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో గాదె మహిపాల్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ బిచ్చన్న ముదిరాజ్, వార్డు సభ్యులు కాటన్ పల్లి మహిపాల్ ముదిరాజ్, గండి గోపాల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area