రాజయ్య ఎంఎల్ఏ గా మళ్లీ గెలవాలి

స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 03, ( జనం సాక్షి) :
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య కు దమ్ముం టే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెల వాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లామాజీ ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్ డిమాండ్ చేసా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ య్య కు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే పదవి చెప్పుతో సమానం అన్న మీకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పోరాటం చేయకున్నా 1999 సంవత్సరలో మీకు టికెట్ ఇచ్చింది వాస్త వం కాదా అని ప్రశ్నించారు. అలాంటి పార్టీని విమ ర్శలు చేయడం సిగ్గుచేటని,2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీటికెట్ ఇవ్వకపోతే  ఇండిపెండెంట్ గా విమానంగుర్తుమీద పోటీచేఫస్తే వచ్చినఓట్లుఎన్ని, అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ ఐతే  2009 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ దివంగత ముఖ్య మంత్రి వైస్సార్ రాజయ్య ను ఎమ్మెల్యేగా చేసింది వాస్తవం కాదా అని అన్నారు. గెలిచినా 6నెలలకే ఎమ్మెల్యే పదవి అడ్డు పెట్టుకొ ని మీ మీద అంగన్ వాడి నుండి సీడీఫ్ నిధులవరకు అవినీతి చేసార ని విమర్శలు వస్తే అవినీతి కప్పిపుచ్చుకోవడానికి తెరాసపార్టీలోచేరి జై తెలంగాణ నినాదం ఎత్తుకొ ని అప్పటి నుండి ఇప్పటి వరకు రాజకీయ పబ్బం గడుపుకున్నది రాజయ్య కాదా అని అన్నారు. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రె స్ పార్టీకి రాజయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయుచున్నాము, లేకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి స్తామని అన్నారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ జిల్లాప్రధానకార్యదర్శి కోరుకోప్పులమధు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు చల్లా తిరుపతి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు నీలా రాకేష్.జంపాల శ్రీనివాస్. మామిండ్ల శ్రీనివా స్. విరస్వామి తదితరులు పాల్గొన్నారు.