రాయికోడ్ మండల కేంద్రంలో 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తహ
రాయికోడ్ మండల కేంద్రంలో 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తహ” వేడుకల్లో భాగంగా గురువారం నాడు మండల అభివృద్ధి, రెవెన్యూ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 2 కే “ఫ్రీడం రన్” కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి వ్యవసాయ మార్కెట్ కమిటీ వరకు ర్యాలీ ని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు నుండి రాయికోడ్ ఎక్స్ రోడ్ వరకు జాతీయ జెండాలు చేత పట్టుకొని వందేమాతరం అంటూ నినాదాలతో 2 3 “ఫ్రీడం రన్”ను కార్యక్రమాన్ని కొనసాగించారు. రాయికోడ్ మండలంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో తహసీల్దార్ రాజయ్య, ఎంపీడీఓ వెంకటేశం, ఎస్సై ఏడుకొండలు, జెడ్పిటిసి మల్లికార్జున్ పాటిల్, మండల తెరాస అధ్యక్షుడు భాస్వరాజ్ పాటిల్, స్థానిక సర్పంచ్ కేదారినాథ్ పాటిల్ . నర్సింలు . టిఆర్ఎస్ మండల యువ నాయకులు శివకుమార్ మండలంలోని గ్రామ పంచాయతి సెక్రటరీ లు, లక్ష్మణ్. రాజేందర్ పటేల్. బాలకృష్ణారెడ్డి. సుభాష్. సంగమేశ్. మల్లేష్ ఎల్లయ్య. దుర్గయ్య .సుప్రియ ప్రియాంక. అమూల్య. ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
