రాష్ట్రం విడిపోతేనే అభివృద్ధి సాధ్యం:ఎంపీ వివేక్‌

కరీంనగర్‌: రాష్ట్రంలో విడిపోతేనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణపై సానుకూల నిర్ణయం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ వడితెల రాజేశ్వరరావు ప్రథమ వర్థంతి సభకు వివేక్‌ హాజరయ్యారు. వివేక్‌తో పాటు ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కూడా ఉన్నారు.