రాష్ట్రస్థాయికి పోటీలకు.ఎంపికైన విద్యార్థిని అభినందించిన అధ్యాపకులు.

 

 

 

 

 

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 12 (జనంసాక్షి) పరుగు పందెంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి సాయికుమార్ అధ్యాపకులు సోమవారం అభినందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సర చదువుతున్న అజ్మీర్ సాయికుమార్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ క్రీడా పోటీల్లో అండర్ 18 విభాగంలో 6 కిలోమీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైయ్యారు. సాయికుమార్ కు అధ్యాపకులు అభినందనలు తెలిపారు. ఈనెల 18న మహబూబాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో సాయికుమార్ పాల్గొననున్నారు. అభినందనలు తెలిపిన వారిలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్, అధ్యాపకులు బుర్ర వెంకటేశం ,కార్తీక్ రెడ్డి, వాసరవెని పరుశురాములు, వ్యాయామ ఉపాధ్యాయులు నితిన్ అధ్యాపకులు ఉన్నారు.