రాస్తారోకో చేస్తున్న 50 మంది అరెస్టు

పెబ్బేరు: సడక్‌ బంద్‌లో భాగంగా 44వ నెంబరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గిస్తున్న 50 మంది భాజపా కార్యకర్తలను పెబ్బేరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పెబ్బేరు జాతీయ రహదారిపై పోలీసులు భారీగా మోహరించి వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా చూస్తున్నారు.