రెండు ద్విచక్ర వాహనాలు ఢీ, ఒకరి మృతి

వడ్డేపల్లి: మండలంలోని శాంతినగర్‌-పైపాడు రహదారి మధ్యలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.