రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి

కడప,అగస్టు21(జనంసాక్షి): కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాజంపేట మండలం మందరం గ్రామశివారులో ఈ సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంలో రెండు బైకులపై ప్రయాణిస్తున్న తండ్రీకుమార్తెతో పాటు మరో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.