రెండు రైళ్లు ఢీ..

` ఆరుగురు మృతి.. పలువురికి తీవ్రగాయాలు
` విజయనగరం జిల్లాలో ఘటన
విజయనగరం(జనంసాక్షి): విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో విజయనగరం ఆసుపత్రికి తరలిస్తున్నారు. రైల్వే అధికారుల, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 7.10 గంటల సమయంలో విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ`కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ కోసం పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ`రాయగడ రైలు.. ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది. ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్‌ఎం సౌరబ్‌ ప్రసాద్‌ సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడిరది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఘటనా స్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది.