రైతులకు మేం అన్నం పెడితే…బిజెపి సున్నం పెడుతోంది

దేశ సంపదను అమ్మడంలో బిజెపి నెంబర్‌ వన్‌
కెసిఆర్‌ ఓపికను..సమనాన్ని అలుసుగా తీసుకోవద్దు
విూడియాతో ఎమ్మెల్సీ కవిత
కామారెడ్డి,ఫిబ్రవరి24(జనం సాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అన్నం పెడితే, బీజేపీ సున్నం పెడుతోందని ఆమె ఆరోపించారు.రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు నోరు విప్పడం లేదని ఆమె విమర్శించారు. దేశ ప్రజల ప్రయోజనం కోసం పోరాడేది కేవలం టీఆర్‌ఎస్‌ మాత్రమేనని అన్నారు. దేశ సంపదను అమ్మడంలో బీజేపీ నెంబర్‌ వన్‌ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓపికను, సహనాన్ని చేతకాని తనంగా భావించొద్దని కవిత స్పష్టం చేశారు. నీళ్లు, నిధులకేడ్చిన తెలంగాణ కోసం పట్టుదలతో ముందుకొచ్చిన నేత కేసీఆర్‌ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె విూడియాతో మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో కేసీఆర్‌ తెలంగాణ సాధించారని ఆమె అన్నారు. సత్యం చెప్పి ఉద్యమం చేశారు.. నిజం చెబుతూనే రాష్ట్ర అభివృద్ధి చేశారని ఆమె తెలిపారు. ఏం చేస్తామో అదే చెప్పడం కేసీఆర్‌ నైజమని ఆమె పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు అవాకులు చెవాకులు పేలినప్పుడు.. మనం చేసిన అభివృద్ధి పనులను చెప్పి సమాధానం ఇవ్వాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న పనులను తెలుసుకోవాలని ఆమె సూచించారు. కరోనా సమయంలోనూ టీఆర్‌ఎస్‌ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదని ఆమె స్పష్టం చేశారు. మనం రైతులకు అన్నం పెడితే.. మోదీ సున్నం పెడుతున్నారని ఆమె ఆరోపించారు. మోటర్లకు విూటర్లు పెడతామని మోదీ అంటే.. ఇక్కడ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడుతలేరని ఆమె విమర్శించారు. ఢల్లీి అయినా, గల్లీ అయినా పేద ప్రజల తరపున గొంతెత్తేది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని ఆమె వ్యాఖ్యానించారు.