రైతుల్ని అన్నివిధాలుగాఆదుకుంటాం : శ్రీధర్‌బాబు భరోసా

హైదరాబాద్‌, నవంబర్‌ 4 (జనంసాక్షి) : నీలం తుపానుతో నష్టపోయిన రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని రాష్ట్ర పౌరస రఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రైతులకు భరోసా ఇచ్చారు. సచివా లయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. పలు జిల్లాల్లో 17,036 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. తపాను సహాయక చర్యలో విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం అందించి ఆదుకుంటామని వివరించారు.