రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని బాలుడు మృతి

ఇటిక్యాల: మండల పరిధిలోని జింకలపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొని నర్సింహులు (6) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం లొద్దిపల్లి గ్రామానికి చెందిన వాడు. బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.