రోడ్డు ప్రమాదంలో బిజేపీ నేత దుర్మరణం

కొస్గి, (జనంసాక్షి): గుర్తు తెలియని వాహనం ఢీ కొని కోస్గా మండలంలో బీజేపీ నాయకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ మునవార్‌ షరీఫ్‌ కథనం ప్రకారం మండల బీజేపీ నాయకుడు బీడీల వెంకటేష్‌ (40) పని మీద నాచారం గ్రామానికి వెళ్లి వస్తుండగా తిరుగు ప్రయాణంలో సంగీత్‌ దాబా దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లడంతో బీడీల వెంకటేష్‌ సంఘటణ స్థలంలోనే మృతి చెందాడు. మృతిడి భార్య బీడీల పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శవానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.