రోడ్డు ప్రమాదంలో 11 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): కోస్గి మండలం బోగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో -ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.