లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు

నల్లబెల్లి సెప్టెంబర్ 29 (జనం సాక్షి):
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని నారక్కపేట గ్రామంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత నాలుగవ రోజు లలిత త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. బోడిగే కృష్ణవేణి కృష్ణ, శ్రీపతి శైలజ చిరంజీవి, బొడిగే సౌజన్య సుమన్, కావటి స్వర్ణలత కృష్ణరాజు దంపతులు పూజల పాల్గొనగా పూజారి వీరభద్రా చారి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైనాల అశోక్, వడ్లూరి రమేష్, వనపర్తి రాజు, వైనాల రత్నాకర్,దండెం రాజేష్ పాల్గొన్నారు.