లారీని వేగంగా ఢీకొన్న కారు

ముగ్గరు అక్కడిక్కడే మృతి

వికారాబాద్‌,జూలై13(జనంసాక్షి :): వికారాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పూడూరులో
ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులను జహిరాబీ (68), జావెద్‌ (12), ఉమర్‌ (6)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.