లింగంపల్లి కలాన్లో వాటర్ ప్లాంటేషన్ ప్రారంభంచిన

ప్రముఖ శ్రస్రా వేత్త పైడీ ఎల్లారెడ్డి

నాగిరెడ్డిపేట్:01 అక్టోబర్ జనం సాక్షి -మండలంలోని లింగంపల్లి కలాన్ గ్రామంలో వాటర్ ప్లాంటేషన్ను ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి రిబ్బన్ కట్ చేసి శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మంచినీరు ముఖ్యకారణమని,ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో గ్రామ,గ్రామాన వాటర్ ప్లాంట్ను ప్రారంభించడం జరుగుతుందన్నారు.ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యమైన నీటిని తాగి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.ఎందుకంటే ఎక్కువగా రోగాలు నీటి వలన వస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ దివిటి రాజ దాస్,జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్రెడ్డి,ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు,సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ఆంజనేయులు,గ్రామ సర్పంచ్ మన్నెమ్మ,ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,వార్డు మెంబర్లు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.