వంగర గురుకుల పాఠశాల బాలికలకు సీలింగ్ ఫ్యాన్స్ అందజేత

భీమదేవరపల్లి మండలం ఆగస్టు (26) జనంసాక్షి న్యూస్
మండలంలోని డాక్టర్ పివి రంగారావు బాలికల గురుకుల పాఠశాల,బాలికల జూనియర్ కళాశాలకు శుక్రవారం నాడు విధ్యాకమిటి చైర్మన్ అనపురం రమేశ్ ఐదు సీలింగ్ ఫ్యాన్స్ ను ప్రిన్సిపాల్ సురేఖ కి అందజేశారు.వర్షాకాలం దృష్ట్యా దోమల బారిన పడకుండా ఉండేందుకు ఫ్యాన్ అందజేసినట్లు డాక్టర్ పీవీ రంగారావు బాలికల గురుకుల పాఠశాల విద్య కమిటీ చైర్మన్ ఆనపురం రమేశ్ తెలిపారు.అనంతరం పాఠశాల కమిటీ లో వంటలను పరిశీలించారు.మెను అమలు సక్రమంగా జరిగేటట్లు చూడాల ని ప్రిన్సిపాల్ ని కోరారు.2022 సంవత్సరం పదవ తరగతి లో 18 మంది విద్యార్థినిలు10 జిపిఎ,9మంది విద్యార్థినులు సాధించగా 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.ఇంటర్ మీడియట్ లో కూడా మంచి రిజల్ట్ తెచ్చినందుకు గాను,గురుకులాల సెక్రెటరీ నుండి మెమెంటో తో పాటు ప్రిన్సిపాల్ కి శాలువాతో సన్మానం చేయడం తో విద్యాకమిటి తరుపున ప్రిన్సిపాల్ సురేఖకు,టీచింగ్,నాంటీచింగ్ సిబ్బిందికి అభినందనలు తెలిపారు.2023 లో కూడా ఇంకా మంచి రిజల్ట్ తెచ్చేందుకు ఫాకల్టీ కృషి చేయాలని కమిటీ సభ్యులు కోరారు.ఈ కార్యక్రమం లో ఎటీపి సుధారాణి,ఫాకల్టీ భార్గవి,సుచరిత,ధర్మ,ఆముక్త,ఎస్ఎంసి వైస్ చైర్మన్ రచన రాజు,కమిటీ సభ్యులు రమేశ్,రాజన్న,రవి తదిరులు పాల్గొన్నారు.