వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

పానగల్‌, జనంసాక్షి: వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని చింతకుంట గ్రామంలో చోటు  చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి  చెందిన నర్శింహ (50) సోమవారం ఉపాధి పనులకు వెళ్లాడు ఆ సమయంలో వడదెబ్బ తగిలి అస్వస్థలకు గురుయ్యాడు. దీంతో అతను పని మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయాడు. సోమవారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలున్నారు. మంగళవారం గ్రామాన్ని ఉపాధి ప్రాజెక్టు అధికారి నవీన్‌కుమార్‌ సందర్శించారు.