వరద బాధితులకు అండగా నిలవాలి

వనపర్తి,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): భారీ వర్షాలు, వరదల కారణంగా అదిలాబాదు ,ఆసిఫాబాద్‌ జిల్లాలోని అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. సర్వస్వం కోల్పోయిన వరద బాధితులకు అండగా నిలబడాల్సిన అవసరం మానవత్వం ఉన్న ప్రతిఒక్కరిబాధ్యత. ఇందులో భాగంగానే అదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ వరద బాధితులకు సహాయం అందించేందుకు గాను జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి ఒక ప్రకటనలో కోరారు. వరద బాధితులకు సహాయం అందించే దాతలు బియ్యం,పప్పులు, దుప్పట్లు, , తదితర సామాగ్రి రూపేనా లేదా నగదు రూపేనా సహాయం అందించాలని ఆమె కోరారు. నగదు రూపంలో సహాయం అందించేవారు వారి విరాళాలను జిల్లా కలెక్టర్‌ వనపర్తి పేరున ఆంధ్రా బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌063210100166862 కు పంపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.