వరి కొనుగోలు కేంద్రాన్ని అకస్మిక తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్.

మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్ అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియను, ట్యాబ్ ఎంట్రీని, రికార్డులను పరీక్షించారు.ట్యాబ్ ఎంట్రీ ఇంకా వేగవంతం చేయాలని సీఈఓ కు సూచించారు. కౌలు రైతులకు సంబంధించి ఓటిపిలను తొందరగా అయ్యేటట్టు చూడాలని ఏఈఓ ని ఆదేశించారు.రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.రైతులతో మాట్లాడుతూ సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి ప్రతినిత్యం అధికారులతో సంప్రదింపులు జరుపుతాడని,ప్రతి సమస్యను మా దృష్టికి తీసుకొస్తాడని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డి సి ఓ వసంత గారు,ఏఎస్ఓ వెంకట్ గారు,మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు గారు, పద్మాజి వాడి సొసైటీ చైర్మన్ గంగాధర్ గారు,సీఈఓ బైరయ్య, సొసైటీ సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.