విజయవంతమైన వైద్య శిభిరం

నాగర్ కర్నూల్ రూరల్ సెప్టెంబర్ 08(జనంసాక్షి)

శ్రీపురం గ్రామంలో బాలవికాస సంస్థ అధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ శిబిరంలో రెడ్ క్రాస్ సొసైటి సెక్రెటరీ సి.రమేష్ రెడ్డి మాట్లాడుతూ,శ్రీపురం గ్రామంలో అనారోగ్య బారిన పడిన వారికి మరియు స్త్రీ వైద్య సమస్యలు ఉన్న వారికి స్త్రీ వైద్య నిపణురాలు డా.హరిప్రియ చిన్న పిల్లల వైద్య నిపుణులు డా.రోహిత్,డాక్టర్ సాయినికిత, డాక్టర్.సూర్య అధ్వర్యంలో వైద్యులతో వైద్య పరీక్షలు,నిర్వహించి 350 మందికి ఉచితంగా మందులు అందజేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మైనగాని.నిరంజన్,శ్రీధర్,డి.కుమార్,వార్డ్ మెంబర్ గందం ప్రసాద,బాలవికాస సంస్థ కోఆర్డినేటర్లు శోభ,కళ్యాణి మరియు ఆశా కార్యకర్తలు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.