విద్యార్థులకు వైద్య పరీక్షలు-ఆయుష్ వైద్య అధికారిని సంధ్యారాణి.

శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 19
మోడల్ స్కూల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు శనివారం నిర్వహించినట్లు ఆయుష్ వైద్య అధికారిని సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా వైద్య అధికారిని సంధ్యారాణి మాట్లాడారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయుష్ వైద్యశాల ఆధ్వర్యంలో శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, రక్తహీనత, జ్వర పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, ఆయుష్ ఫార్మసిస్ట్ అర్చన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.