విద్యార్థులు శాస్త్రీయ వైఖరిని పెంపొందించుకోవాలి

..జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జితేందర్ గౌడ్
పానుగల్ అక్టోబర్ 09,జనంసాక్షి
 నేటి విద్యార్థులు శాస్త్రీయ వైఖరిని పెంపొందించుకోవాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జితేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలోని న్యూ విజన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు మూఢనమ్మకాల పట్ల  పూర్తి శాస్త్రీయతో విద్యను అభ్యసించాలని కోరారు. అదే విధంగా  విద్యార్థులకు స్పీడ్ మాథ్స్ మెలకువలను తెలిపారు. ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా అధ్యక్షులు  ప్రవీణ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి రవికుమార్, పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్, వెంకటయ్య మరియువిద్యార్థులు పాల్గొన్నారు.