విద్యుత్తు కోతలకు నిరసనగా రైతుల ఆందోళన

దౌలతాబాద్‌: మండలంలో విద్యుత్తు కోతలకు నిరసనగా మీటూరు, నరసాపురం, కౌడీడు గ్రామాల రైతులు ఎండిన వరి, కంకులను చేతపట్టుకుని మండల కేంద్రంలోని విద్యుత్తు ఉపకేంద్రం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ శాఖ ఏఈ శ్రీనివాస్‌తో ఫోనులో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.