*విద్యుత్ షాక్ గురై గేదె మృతి*

రేగొండ (జనం సాక్షి) : విద్యుత్ షాక్ కు గురై గేదె మృతి చెందిన సంఘటన రేగొండ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అంబాల భాస్కర్ గేదె మేత కోసం వెళ్లి వస్తుండగా గ్రామ శివారులో విద్యుత్ తీగల తెగిపడి షాక్ కు గురైంది. 80 వేల రూపాయల విలువ చేసే గేదె మృతి చెందడంతో పాడి రైతు భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.