“విధ్య తోనే జీవితాలకువెలుగు”

ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రత్యేక  చొరవ తో ఇది సాధ్యం అయింది పట్టుదల తో చదివి  ఉన్నత శిఖరాలకు చేరడమే ముఖ్యమంత్రి కి  విద్యార్ధులు ఇచ్చే గిఫ్ట్
పెన్ పహాడ్ సెప్టెంబర్ 21 (జనం సాక్షి) :
మండల కేంద్రం లో 4 కోట్ల 50 లక్షల  రూపాయల వ్యయం తో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం  నూతన భవనాన్ని  ప్రారంభించి ప్రజలకు అంకితం ఇచ్చిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
హాజరైన  తెలంగాణ  ఎడ్యుకేషన్ &వెల్ఫేర్  ఇన్ఫ్రాస్ట్రక్చర్  చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ఫోటోరైటఫ్:భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి, విద్యతోనే జీవితాలకు వెలుగులు ప్రసాదించి
విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో ని టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని,స్థానిక శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు మండల కేంద్రంలో 4 కోట్ల 50లక్షల వ్యయంతో నూతనంగా  నిర్మించిన కస్తూర్భా గాంధీ  పాఠశాల భవనాన్ని తెలంగాణ  ఎడ్యుకేషన్,వెల్ఫేర్  ఇన్ఫ్రాస్ట్రక్చర్  చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి తో కలిసి  ప్రారంభించిన మంత్రి కార్పొరేట్ విద్యాసంస్థలకు  దీటుగా సకల హంగులతో  నిర్మించిన భవనాన్ని ప్రజలకు అంకితం చేశారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రెసిడెన్షియల్‌ పాఠ శాలలు ఏర్పాటుచేసి పేద, మధ్యతరగతి విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు రాష్ట్రం ఏర్పడక ముందు నాలుగు వందల గురుకులాలు మాత్రమే ఉండేవని, రాష్ట్రం ఏర్పడిన తరువాత 1150 జూనియర్‌ కళాశాలలను రెసిడెన్షియల్‌ కళాశాలలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి వరకు ఉన్న కస్తూర్బా పాఠశాలలను 270 జూనియర్‌ కళాశాలలగా అప్‌గ్రేడ్‌ చేశామన్నారు విధ్య పై సిఎం కేసీఆర్ గారికి ఉన్న దార్శనికత , ప్రత్యేక చొరవతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో నాణ్యమైన విద్యనందిస్తుండటం వలన ఈ కళాశాలలు, పాఠశాలల్లో సీట్లకోసం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కడుతున్నారన్నారు ఇటీవల పీ.జీ ఎంట్రన్స్ లో  సగానికి  పైగా సీట్లు ప్రభుత్వ రెసిడెన్షియల్  విద్యార్ధులు సాదించడం శుభ పరిణామం అన్నారు రెసిడెన్షియల్ పాఠశాలలలో సీట్ల కోసం మెరిట్ మాత్రమే  ప్రాతిపాధిక అని అన్న మంత్రి   ఎటువంటి ఫైరవీలకు తావు లేదని స్పష్టం చేశారు పట్టుదలతో చదివి  ఉన్నత శిఖరాలను అదిరోహించడం ద్వారా మంచి విద్యను,నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు   విద్యార్థులు అందించే గిఫ్ట్ని మంత్రి తెలిపారు పట్టుదలతో చదివితే ఉన్నత శిఖరాలకు చేరకోవచ్చనడానికి  డా” బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితమే ఉదాహరణ అని అయన ను స్పూర్తి గా తీసుకుని విద్యార్థులు తమ జీవితాలలో ఉన్నత స్థాయి కి చేరుకోవాలని మంత్రి  కోరారు. ఈ మధ్య కాలంలో లో కొంత మంది బాధ్యత లేని ఐఎఎస్ ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారి అసత్యపు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్తితి లేదని మంత్రి హెద్దేవా చేశారు.. ఈ సందర్బంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కతిక ప్రదర్శనలను  ఆసాంతం మంత్రి  వీక్షించి వారితో సరదా గా గడిపారు.. అనంతరం పాఠశాల ప్రాంగణం లో మంత్రి మొక్కలు నాటి విద్యార్థులకు , ఉపాధ్యాయ సిబ్బంది కి శుభాకాంక్షలు తెలిపారు.. కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ పాటిల్ , జడ్పీ చైర్మన్ గూజ్జా దీపికా, పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మాది బిక్షం, జడ్పీటిసి మామిడి అనిత అంజయ్య, మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్ , సింగిల్ విండో చైర్మన్ లు వెన్న సీతారామ్ రెడ్డి, నాతాల జానికి రామ్ రెడ్డి , సర్పంచ్ తూముల శ్వేతా సురేష్ రావు, ఎంపిటిసి ఉరుకొండ రాధాకృష్ణ, అధికారులు,డిఇఓ అశోక్, తహసీల్దార్ శేషగిరిరావు, ఎంఇఓ రవి,ఎస్వో ఆసియా జాబిన్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, టీ.ఆర్.ఎస్ నాయకులు కార్యకర్తలు తదితులు పాల్గోన్నారు..