విపిన్ చంద్ర భౌతికకాయానికి నివాళులర్పించిన‌-మంత్రి హరీశ్‌రావు

రంగారెడ్డి(జ‌నం సాక్షి): రిటైర్డ్ సీఈ, ఇంజినీర్స్ ఫోరం అధ్యక్షులు శ్యాం ప్రసాద్‌రెడ్డి కుమారుడు డాక్టర్ విపిన్ చంద్ర(37) గుండెపోటుతో మృతిచెందారు. రాగన్నగూడెంలోని నివాసంలో విపిన్ చంద్ర భౌతికకాయానికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నివాళులర్పించారు. -శ్యాంప్రసాద్‌రెడ్డి కుటుంబాన్ని హరీశ్‌రావు పరామర్శించారు. విపిన్ భౌతికకాయానికి రైతు సమన్వయసమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ నివాళులర్పించారు.