వివేకానంద హంతకులను త్వరగా పట్టుకోవాలి: నారాయణ

కడప,ఆగస్ట్‌11(జనం సాక్షి): వైఎస్‌ వివేకానంద రెడ్డి చాలా మంచి మనిషి అని.. ఆయన హత్యకు గురవడం
చాలా బాధాకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారిని త్వరగా పట్టుకొని శిక్షించాలన్నారు. సిబిఐ విచారణ జరుగుతున్నా నిందితులను గుర్తించకపోవడం దారుణమన్నారు. హంతకులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు నిండు జేబుతో బయటకి వెళ్లి.. ఖాళీ జేబుతో ఇంటికి వచ్చేవారన్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఖాళీ జేబుతో బయటికి వెళ్లి.. నిండు జేబుతో ఇంటికి వస్తున్నారని నారాయణ పేర్కొన్నారు.