వ్యవసాయ వర్సిటీ విసిగా కమిషనర్‌ బాధ్యతలు

ప్రవీణ్‌ రావుపదవీ విరమణతో ప్రభుత్వం ఆదేశాలు

హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి: ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి ఉపకులపతిగా రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు వీసీగా పనిచేసిన వి.ప్రవీణ్‌రావు పదవీకాలం ఈ నెల 24తో ముగిసిపోగా..రాష్ట్ర ప్రభుత్వం ఆయన స్థానంలో కొత్త వీసీని నియమించలేదు. ఈ నేపథ్యంలో రఘునందన్‌రావు ఇన్‌చార్జి వీసీగా నియమించడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే ఈయన జోడు పదవుల్లో కొనసాగుతున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శితోపాటు కమిషనర్‌ పోస్టులోనూ రఘునందన్‌రావే ఉన్నారు. తాజాగా ఆయనకు వ్యవసాయ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ బాధ్యతలు కూడా అప్పగించారు.