శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో మండల దీక్ష మాల ధారణలు…

కేసముద్రం అక్టోబర్ 7 జనం సాక్షి/శుక్రవారం రోజున కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీధర్మశాస్త్ర దేవాలయంలో మండల దీక్ష మాల ధారణ కార్యక్రమం ప్రారంభమైంది.ఉదయం గణపతి హోమం,అర్చన అనంతరం పలువురు స్వాములు మాల ధరించారు.మాల ధరించిన వారిలో విలేజ్ కేసముద్రం కు చెందిన కీర్తి సుధాకర్ గురు స్వామి,వెన్ను బిక్షపతి,తోట సదానందం,కీర్తి కొమురయ్య,కంచ సురేష్ లు ఉన్నారు.వీరికి దేవాలయ తంత్రి ఉన్నికృష్ణన్ నంబూద్రి మాల ధరింప చేశారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కోశాధికారి బోగోజు నాగేశ్వర చారి, జనగాం వెంకట్,జెకె పాల్గొన్నారు.