సంక్షేమ పథకాల ప్రాచారానికి బస్సుయాత్ర ప్రారంభించిన మంత్రి

షాద్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో మంత్రి డీకే అరుణ బస్సుయాత్ర ప్రారంభించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు విస్తృతప్రచారం చేపట్టడానికి ప్రారంభించిన ఈ బస్సు యాత్ర షాద్‌నగర్‌ నుంచి తలకొండపల్లి, ఆమనగల్‌ మీదుగా సాయంత్రానికి కల్వకుర్తి  చేరుకుంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ గురించి వివరిస్తూ మంత్రి అరుణ దళితులకు, గిరిజనులకు పూర్తిస్థాయి సహకారాన్ని అందించే దిశగా సబ్‌ప్లాన్‌ నిధులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తెదేపా, వైకాపాలు చెప్తున్న మాటలు నమ్మవద్దని, ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్సే కృషి చేస్తుందని ఆమె చెప్పారు.