సాగర్ ఎడమ కాలువలో గల్లంతైన మృతదేహం లభ్యం

మిర్యాలగూడ ,జనం సాక్షి

 

నాగార్జునసాగర్ ఎడమ కాలువలో ఈత కోసం వెళ్ళిన యువకుడు గల్లంతైన మృతదేహం బుధవారం లభ్యమయింది. మిర్యాలగూడ రూరల్ ఎస్సై నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం..
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం మైసమ్మకుంట తండాకు చెందిన బాణావత్ శంకర్ ( 20 ) తన స్నేహితుడైన శ్రీధర్ తో కలిసి కురియా తండ వద్ద గల నాగార్జునసాగర్ ఎడమ కాలువ లో ఈనెల 11వ తేదీన (మంగళవారం ) ఈత కొట్టుటకు వెళ్లి ఇటు నుండి అటు ఒడ్డు చేరుటకు వెళుతుండగా నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయినాడు.అతనిని గాలించగా బుధవారం మిర్యాలగూడ మండలం తక్కెలపాడు, శెట్టిపాలెం శివారులో కాలువలో ఒడ్డులో శవమై తేలి ఉన్నాడు. సంఘటన స్థలాన్ని మిర్యాలగూడ రూరల్ ఎస్ ఐ డి నరసింహులు సందర్శించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనైనది. మృతుడి తల్లి ధనవత్ లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయనైనదని తెలిపారు.