సింగోటంలో వైభవంగా రథోత్సవం

నాగర్‌ కర్నూలు,జనవరి19(జ‌నంసాక్షి): నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటం గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి బ్ర¬్మత్సవాల్లో ఘనంగా ముగిసాయి. ఇందులో భాగంగా శుక్రవరాం సాయంత్రం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాఘ మాసంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవాన్ని తిలకించేందుకు ఆంధ్రా, కర్నాటకతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సింగటం గ్రామం గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తుల రాకతో భారీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.