సింధుపై కనక వర్షం

3

పివి సింధుకు భారీ నజరానా ప్రకటించిన కెసిఆర్‌

5కోట్ల నగదు, వేయిగజాల స్థలం..కోరుకుంటే ఉద్యోగం

22న ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయం

గోపీచంద్‌ అకాడమికి కోటి నజరానా

సాక్షి మాలిక్‌కుకూడా కోటి నజరానా

హైదరాబాద్‌,ఆగస్టు 20(జనంసాక్షి): ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం భారీ నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఆమెకు ప్రభుత్వం ఉద్యోగంతో పాటు రూ.5 కోట్లు నగదు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. దీంతో పాటు వెయ్యిగజాల స్థలం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పీవీ సింధు కోచ్‌ గోపీచంద్‌కు కూడా రూ. కోటి నగదు ప్రోత్సాహకాన్ని అందజేయనున్నామని సీఎం అన్నారు. సింధు తెలంగాణ ముద్దు బిడ్డ అని ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నామని సిఎం కెసిఆర్‌ తెలిపారు. కేబినేట్‌ సమావేశం అనంతరం సిఎం విూడియాతో మాట్లాడుతూ తాము గతంలో సానియా విూర్జాను కూడా ప్రోత్సహించగా మంచి విజయాలు సాధించిందని అన్నారు. ఇప్పుడు సింధు కూడా అలాంటి విజయాలు సాధించాలని కోరకుంటున్నామని అన్నారు.  ఆమె ఎటూ హైదరాబాద్‌లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడే ఆమెకు వెయ్యి గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని.. అలాగే ఆమె చేస్తానంటే ఆమెకు తగిన ఉద్యోగం ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు.ఇప్పటివరకు ఎంతోమంది ఛాంపియన్లను కోచ్‌ పు/-లలెల గోపీచంద్‌ తయారుచేశారని, ఆయన చేతుల విూదుగానే సింధుతో పాట సైనా నెహ్వాల్‌, గుత్తా జ్వాల, కిదాంబి శ్రీకాంత్‌ లాంటి క్రీడాకారులు వచ్చారని.. ఈ రంగంలో ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు కోటి రూపాయల ప్రోత్సాహక బహుమతి ఇస్తామని చెప్పారు.ఇంతకుముందు టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా విూర్జా వరుసగా సంవత్సరం అంతా గెలుస్తూనే వచ్చిందని.. ఈ అమ్మాయి (సింధు) కూడా అలాగే గెలవాలని తెలంగాణ సర్కారు కోరుకుంటోందని తెలిపారు. ఈనెల 22వ తేదీన హైదరాబాద్‌ వస్తున్న పీవీ సింధుకు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని నిర్ణయం తీసుకున్నామని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఒలింపిక్స్‌ మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన హరియాణా క్రీడాకారిణి సాక్షి మాలిక్‌కు కూడా తెలంగాణ తరఫున కోటి రూపాయల ప్రోత్సాహకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన సాక్షి మలిక్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.కోటి అందజేయనున్నామని సీఎం వెల్లడించారు.