సింహాచలం పుష్కరిణిని సందర్శించిన మంత్రి అవంతి


విశాఖపట్నం,అగస్టు21(జనంసాక్షి): సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పుష్కరణిని మంత్రి అవంతి శ్రీనివాస్‌ శనివారం సందర్శించారు. పుష్కరిణి చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌, భక్తులకు మెరుగైన సదుపాయాల కోసం త్రాగునీరు, పార్కు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. పెందుర్తి ఎమ్మెల్యే
అన్నం రెడ్డి అదీప్‌ రాజ్‌ తన తండ్రి పేరు విూద ప్రారంభించిన రియల్‌ ఎస్టేట్‌ బ్రోచర్‌ను మంత్రి అవంతి విడుదల చేశారు.